Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలనలో ఏడుకొండలు కబ్జా అయ్యే అవకాశం ఉంది, ఎవరు?

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (16:48 IST)
జగన్ పాలనలో ఏడు కొండలు కబ్జా అయ్యే అవకాశం ఉందన్నారు బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఏడుకొండలను బిజెపి కాపాడుకుంటుందన్నారు. ఒక మత వ్యాప్తి కోసం జగన్ పాకులాడుతున్నారు. ఎపిలో అభివృద్ధి శూన్యమనీ.. అవినీతికి కొత్తమార్గాలను అన్వేషించడంలో ఎపి సిఎం దిట్ట అని విమర్శించారు.  
 
జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని.. ప్రతి పనిలో అలసత్వం, మౌలిక వసతులపై ఆలోచన లేదు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సంచలన ప్రకటనలు.. అనాలోచిత నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమని, టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి వైసిపి నాయకులకు దోచిపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 
 
జగన్ అవినీతి మొత్తాన్ని త్వరలో బట్టబయలు చేస్తామన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత బిజెపికే ఉందని.. ఆధ్యాత్మిక నగరంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులతోనే అని చెప్పారు.  ప్రభుత్వ అవినీతి, అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళతామని.. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చకుండా అడ్డుకుంది టిడిపి, వైసిపి మాత్రమేనన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments