Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పిచ్చి పీక్స్ చేరింది.. అసెంబ్లీ రౌడీ'లా చంద్రబాబు... జీవీఎల్

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (15:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పిచ్చి పీక్స్ చేరింది... ఆయన ఓ అసెంబ్లీ రౌడీలా ప్రవర్తించారంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ కామెంట్ పోస్ట్ చేశారు.
 
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, శుక్రవారం జరిగిన సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ నేతలతో పాటు.. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, సభలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, పైడికొండల మణిక్యాల రావులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ గడ్డపై పుట్టి కేంద్రానికి ఊడిగం చేస్తారా అంటూ నిలదీశారు.
 
విభజన నష్టపోయిన ఆంధ్రాకు మోడీ చేస్తున్న అన్యాయాన్ని సిగ్గులేకుండా ప్రశ్నిస్తారా అంటూ నిలదీశారు. ఇదే విషయాన్ని నేను ప్రస్తావిసే జైల్లో పెడతారా? మీకు వ్యతిరేకంగా ఉంటే ఫినిష్ చేస్తారా? ఎమ్మెల్యేలుగా ఉండే అర్హత మీకు లేదంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
 
దీనిపై ఏపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న జీవీఎల్ నరసింహారావు శనివారం ట్వీట్ చేశారు. "సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుగారితో ప్రవర్తించిన తీరు చూస్తే "పిచ్చి పీక్స్"కు చేరినట్లు తెలుస్తోంది. మహా ఫ్రస్ట్రేషన్లో వున్న సీఎం "అసెంబ్లీ రౌడీ"లాగా ప్రవర్తించారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments