Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బిగ్ బాస్-3 ప్రసారాలు నిలిపివేస్తారా? బీజేపీ ఏమంటోంది?

Webdunia
సోమవారం, 22 జులై 2019 (16:53 IST)
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్ ఆదివారం నుంచి ప్రారంభమైనప్పటికీ వివాదాలకు మాత్రం ఫుల్‌స్టాప్ పడట్లేదు. ఇప్పటికే ఈ షోను ఆపేయాలని కొందరు.. సినిమా మాదిరిగానే ప్రతి ఎపిసోడ్‌ను సెన్సార్ చేయాలని కోరుతూ ప్రముఖ దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 
 
మరోవైపు తమను కంటెస్టెంట్లుగా ఫైనల్ చేసి.. చివరికి మోసం చేశారని యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా కోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి షోను అడ్డుకోవడానికి.. నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కానీ, ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందనుకుంటే మరింత ముదిరింది. 
 
పర్మిషన్ రద్దు చేయండి!
తాజాగా ఈ వివాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "బిగ్ బాస్-సీరీస్‌పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ షో భారతీయ సంప్రదాయాలకు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించి యువతను పక్కదారి పట్టించేలా ఉంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ షో ప్రసారం కాకుండా పర్మిషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని కన్నా కోరారు. 
 
ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరికీ ట్యాగ్ కూడా చేశారు. మొత్తానికి చూస్తే ఇప్పటి వరకూ ఈ వివాదంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారే ఉండగా.. తాజాగా రాజకీయ నేతలు సైతం ఎంటరయ్యారన్న మాట. అయితే ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎలా స్పందిస్తారో..? కన్నా ట్వీట్‌కు ఏమని రియాక్ట్ అవుతారో..? వేచి చూడాల్సిందే మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments