Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై రేషన్ డీలర్లు ఉండరు.. స్టాకిస్టులుగా ఉపాధి కల్పిస్తాం : మంత్రి కొడాలి

Webdunia
సోమవారం, 22 జులై 2019 (15:23 IST)
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై రేషన్ డీలర్లు ఉండరని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నాని తెలిపారు. అయితే, రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా మార్చుతామని తెలిపారు. సోమవారం అమరావతిలోని శాసనసభలో రేషన్ డీలర్ల తొలగింపు అంశంపై చర్చ జరిగింది. దీనికి మంత్రి కొడాలి నాని సమాధానమిచ్చారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం రేషన్ డీలర్లను తొలగించాలని ప్రతిపాదన లేదన్నారు. టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి రేషన్ డీలర్లను తొలిగిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా మార్చుతామన్నారు. 
 
గతంలో నా నియోజకవర్గంలోనే 42 మంది డీలర్లను తొలగించి టీడీపీ అనుచరులను పెట్టారు. టీడీపీ నేతలు డీలర్లను నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒరిజినల్ రేషన్ డీలర్లు ఎవర్ని తొలగించమని, దొంగదారుల్లో వచ్చిన వారు లేచిపోతారని చెప్పారు. గతం ప్రభుత్వం హయంలో రేషన్ డీలర్లపై కేసులు పెట్టారనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపాధి కల్పిస్తారు తప్ప తొలగించరని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments