వైకాపాకు షాక్ : సొంత గూటికి చేరిన మహ్మద్ ఇక్బాల్

వరుణ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (14:40 IST)
ఎన్నికలకు ముందు ఏపీలోని అధికార వైకాపాకు మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వైకాపాను వీడారు. ఈయన తిరిగి సొంత పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
గత కొంతకాలంగా వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆ పార్టీని వీడుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే మహ్మద్ ఇక్బాల్ కూడా పార్టీని వీడారు. కాగా, ఆయన నేపథ్యం పరిశీలిస్తే, ఆయన ఓ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన టీడీపీలో చేరారు. ఆనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైకాపా తీర్థం పుచ్చుకోగా, ఆయన సీఎం జగన్ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారు. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా తరపున హిందూపురం అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశించగా, జగన్ మొండిచేయి చూపించారు. పైగా, హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా, ఆయనకు ఇతర పదవులేవీ కేటాయించలేదు. అప్పటి నుంచి ఇక్బాల్ వైకాపా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల వైకాపాకు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇపుడు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments