Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో టీడీపీ షాక్... వైకాపాలో చేరిన అఖిల ప్రియారెడ్డి మేనమామ

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (11:16 IST)
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దెబ్బపై దెబ్బ తగులుతుంది. టీడీపీకి చెందిన పలువురు నేతలు వైకాపాలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా ఏపీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియా రెడ్డి మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి వైకాపా తీర్థంపుచ్చుకున్నారు. 
 
హైదరాబాద్, లోటస్ పాండ్ జగన్ నివాసానికి వచ్చిన ఎస్వీ జగన్ రెడ్డి, పార్టీ కండువాను కప్పుకున్నారు. ఆళ్లగడ్డకు చెందిన జగన్‌, ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీ జగన్ రెడ్డి వైసీపీలో చేరికతో ఆళ్లగడ్డలో పార్టీ మరింతగా బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇప్పటికే ఆళ్లగడ్డలో పేరున్న ఎస్వీ సుబ్బారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలు వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు, నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశం ఉంది. తనకు టిక్కెట్ కేటాయించని పక్షంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. మొత్తంమీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీని వీడి వైకాపాలో చేరేందుకు అనేక మంది నేతలు క్యూకడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments