Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో టీడీపీ షాక్... వైకాపాలో చేరిన అఖిల ప్రియారెడ్డి మేనమామ

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (11:16 IST)
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దెబ్బపై దెబ్బ తగులుతుంది. టీడీపీకి చెందిన పలువురు నేతలు వైకాపాలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా ఏపీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియా రెడ్డి మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి వైకాపా తీర్థంపుచ్చుకున్నారు. 
 
హైదరాబాద్, లోటస్ పాండ్ జగన్ నివాసానికి వచ్చిన ఎస్వీ జగన్ రెడ్డి, పార్టీ కండువాను కప్పుకున్నారు. ఆళ్లగడ్డకు చెందిన జగన్‌, ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీ జగన్ రెడ్డి వైసీపీలో చేరికతో ఆళ్లగడ్డలో పార్టీ మరింతగా బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇప్పటికే ఆళ్లగడ్డలో పేరున్న ఎస్వీ సుబ్బారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలు వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు, నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశం ఉంది. తనకు టిక్కెట్ కేటాయించని పక్షంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. మొత్తంమీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీని వీడి వైకాపాలో చేరేందుకు అనేక మంది నేతలు క్యూకడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments