Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీ ప్రభాకర్ రెడ్డి - అస్మిత్ రెడ్డిలకు తేరుకోలేని షాక్!

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (10:56 IST)
బీఎస్-3 సిరీస్ వాహనాల కొనుగోలు స్కామ్‌లో అరెస్టు అయిన అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు తేరుకోలేని షాక్ తగిలింది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అలాగే, వీరిని విచారించేందుకు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. 
 
బీఎస్ 3 వాహనాల కొనుగోలు కోసం నకిలీ ఎన్.ఓ.సీలు సృష్టించడం, సంతకాలు ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే గతంలో పెండింగులో మరో రెండు కేసుల్లో కూడా వీరిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో వీరిని కోర్టులో హాజరుపరచగా, ప్రస్తుతం వీరికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. 
 
ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ అనంతపురం కోర్టులో పిటిషన్లను వారిద్దరూ వేర్వేరుగా దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అదేసమయంలో పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. అయితే, న్యాయవాదుల సమక్షంలోనే నిందితులను విచారించాలని కోర్టు ఆదేశాలు జారీచేయడం వారికి కాస్త ఊరటకలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments