Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో వైకాపా ఖేల్‌ఖతం : టీడీపీలో చేరనున్న జగన్ పార్టీ కార్పొరేటర్లు

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (13:02 IST)
విశాఖపట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు అధికార టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం వారంతా వైజాగ్ నుంచి అమరావతికి చేరుకున్నారు. ఇప్పటికే విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 12మంది కార్పొరేటర్లు వైకాపాను వీడి కూటమి చెంతకు చేరగా మరో 9 మంది కార్పొరేటర్లు మంగళవారం టీడీపీలో చేరనున్నారు. 
 
వీరిలో చల్లా రజని, గేదెల లావణ్య, సునీత, భూపతిరాజు సుజాత, ముర్రు వాణిలతో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 29 మంది కార్పొరేటర్లు గెలవగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైకాపా నుంచి 11 మంది నేరుగా టీడీపీలో చేరారు. 
 
అలాగే, జనసేన పార్టీకి ముగ్గురు కార్పొరేటర్లు ఉండగా, వైకాపా, స్వతంత్రలుగా గెలిచిన ఏడుగురు జనసేన పార్టీలో చేరారు. బీజేపీ నుంచి ఒక కార్పొరేటర్ గెలవగా, ఇటీవల వైకాపా నుంచి మరొకరు ఆ పార్టీలో చేరారు. దీంతో కూటమి బలం 52కు చేరింది. తాజాగా మరో తొమ్మిది మంది కార్పొరేటర్లు టీడీపీలోకి రావడంతో కూటమి బలం 61కు చేరింది. 
 
మొత్తం 98 మంది కార్పొరేటర్ స్థానాలు ఉన్న విశాఖ మున్సిపాలిటీలో ప్రస్తుతం 97 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. జీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ మంది కార్పొరేటర్లు టీడీపీ కూటమికి ఉండటంతో 19వ తేదీన వైకాపాకు చెందిన మేయర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ కార్పొరేటర్లు ప్రవేశపెట్టనున్నారు. కూటమి బలం వివరాలతో జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు వారంతా లేఖ రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments