Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో సాఫీగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (10:55 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌లో భాగంగా, ఏపీలోని శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్టణం, ప్రకాశం - నెల్లూరు - చిత్రూ, కడప - అనంతపురం - కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
 
అలాగే, ప్రకాశం- నెల్లూరు - చిత్తూరు, కడప - అనంతపురం - కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, వెస్ట్ గోదావరిలో రెండు, శ్రీకాకుళం, కర్నూలలో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ సాఫీగా సాగుతోంది.
 
అదేవిధంగా తెలంగాణాలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ సాగుతోంది. కాగా, ఏపీలో అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన ఐదు స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమైన విషయం తెల్సిందే. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల16వ తేదీన సాయంత్రం వెల్లడిస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments