Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో సాఫీగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (10:55 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌లో భాగంగా, ఏపీలోని శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్టణం, ప్రకాశం - నెల్లూరు - చిత్రూ, కడప - అనంతపురం - కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
 
అలాగే, ప్రకాశం- నెల్లూరు - చిత్తూరు, కడప - అనంతపురం - కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, వెస్ట్ గోదావరిలో రెండు, శ్రీకాకుళం, కర్నూలలో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ సాఫీగా సాగుతోంది.
 
అదేవిధంగా తెలంగాణాలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ సాగుతోంది. కాగా, ఏపీలో అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన ఐదు స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమైన విషయం తెల్సిందే. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల16వ తేదీన సాయంత్రం వెల్లడిస్తారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments