Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి భూమిపూజ జరిగిన ప్రాంతం ఎలా ఉందో తెలుసా? అఖండ జ్యోతి ఆరిపోయింది..!

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (10:30 IST)
దసరా పండుగ రోజున ఏపీ రాజధాని అమరావతి భూమిపూజ కార్యక్రమాన్ని ఎంత వైభవంగా నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం కోసం దాదాపు రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేశారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా పూర్తి కాకుండా.. అమరావతి నిర్మాణం అట్టహాసంగా ఉంటుందన్న విషయం అర్థమయ్యేలా నిర్వహించారనే చెప్పాలి. 
 
ఇక.. శంకుస్థాపన కోసం ఏపీలోని గ్రామ.. గ్రామాల్లో నుంచి మట్టి.. నీరు తెప్పించి.. అంతా కలిపి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేయటం ద్వారా.. అమరావతి నిర్మాణం ఏపీ ప్రజలందరి భాగస్వామ్యంతో సాగుతుందన్న భావన కలిగేలా ఏపీ సీఎం చంద్రబాబు చేశారు. ఘనంగా నిర్వహించిన తర్వాత శంకుస్థాపన ప్రాంతం.. యాగశాల.. అక్కడ ఏర్పాటు చేసిన దేవతామూర్తులు.. అఖండ జ్యోతి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
అఖండ జ్యోతి ఆరిపోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తు ఈ జ్యోతి ఎప్పుడో ఆరిపోయింది. అయితే.. కోటప్ప కొండకు తరలించటం ద్వారా అఖండజ్యోతి ఆరిపోలేదని చెప్పినా.. దీన్ని ఏర్పాటు చేసిన చోట ఒక శాశ్వత కట్టడం కట్టి ఉంటే బాగుండేది. కానీ.. అలాంటివేమీ జరగలేదు. తాజాగా భారీగా వీచిన గాలులకు అఖండ జ్యోతి స్టాండ్ కొట్టుకుపోవటంతో పాటు.. యాగశాల కూలిపోవటం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments