Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు లోగిళ్ళలో భోగి సంబరాలు... నేతల శుభాకాంక్షలు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (08:22 IST)
తెలుగు ప్రజలకు అతి ప్రధానమైన పండుగ సంక్రాంతి. ఇందులో తొలి రోజు జరుపుకునే పండుగ భోగి. ఈ పండుగను శుక్రవారం తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్నారు. ఈ పండుగను పురస్కరించుకుని తెలుగు ప్రజలంతా వేకువజామునే భోగి మంటలు వేశారు. 
 
దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ శోభ సంతరించుకుంది. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటల వద్ద పిల్లలు, పెద్దల కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. భోగి మంటల వద్ద చిన్నారుల కోలాటాలతో ఆడిపాడారు. హరిదాసుల కీర్తనలతో సందడి వాతావరణం నెలకొంది. 
 
ఇదిలావుంటే, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజకీయ నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ శాఖ చీఫ్ సోము వీర్రాజు, ఇతర పార్టీల నేతలతో పాటు రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌లు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి, తెలుగు ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని వారు కోరారు.
 
కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంక్రాంతి పండుగ కోసం చెన్నైకు వచ్చారు. ఆయన ఈ నెల 16వ తేదీన నెల్లూరు జిల్లాలోని తన స్వగ్రామానికి చేరుకున్నారు. చెన్నై కొట్టూరుపురంలో ఉన్న ఆయన నివాసంలో వెంకయ్య దంపతులు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments