Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి విషయంలో గొడవ - విద్యార్థిని బంధించి చిత్ర హింసలు

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (10:45 IST)
భీమవరంలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి విషయంలో గొడవపడిన కొందరు ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన అంకిత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఓ యువతి విషయంలో నలుగురు విద్యార్థులు అంకిత్‌తో గడవపడ్డారు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన అంకిత్‌ను హాస్టల్‌లోని తమ గదికి పిలిచి అతన్ని బంధిచి కర్రలతో చావబాదారు. ఆపై ఇస్త్రీపెట్టెతో వాతలు పెట్టారు. తనను విడిచిపెట్టాలని బాధిత విద్యార్థి ప్రాధేయపడినా వారు ఏమాత్రం కనికిరించలేదు. 
 
యువకుడిని చితకబాదుతుండగా ఇతర విద్యార్థులు తీసిన వీడియో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు స్పందించారు. దాడికి పాల్పడిన ప్రవీణ్, నీరజ్, స్వరూప్, ప్రేమ‌లపై కేసు నమోదుచేశారు. వీరందా శ్రీకాకులళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కాలేజీ యాజమాన్యం ఆ నలుగురు విద్యార్థులతో పాటు వివాదానికి కారణమైన యువతిని కూడా కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments