Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నుంచి భవానీ మండల దీక్షా ధారణలు ప్రారంభం

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (21:30 IST)
ఈ నెల 15వ తేదీ నుంచి భవానీ మండల దీక్షా ధారణలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 5వ తేదీ నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభంకానున్నాయి. 18న కలశ‌జ్యోతి మహోత్సవం.. అలాగే డిసెంబర్ 25 నుంచి 29 వరకు భవానీ దీక్షా విరమణలు జరుగుతాయి. 29వ తేదీన పూర్ణాహుతితో భవానీ దీక్షాల విరమణలు ముగియనున్నాయి.

భవానీ దీక్షా విరమణ సమయంలో తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తూ.. భవానీ దీక్షా మహోత్సవాల పోస్టర్‌ను ఇంద్రకీలాద్రిపై ఆదివారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో దుర్గగుడి చైర్మన్ పైలా‌ సోమినాయుడు, ఈవో బ్రమరాంబ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవానీ దీక్షా విరణమలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భవానీలకు కొండకింద హోమ గుండాలను ఏర్పాటు చేశామని, వినాయకుని గుడి నుంచి క్యూలైన్ల మీదుగా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. అయితే ఘాట్లలో నదీ స్నానానికి అనుమతి లేదన్నారు. కేవలం జల్లుల స్నానాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.

గిరి ప్రదక్షణకు కలెక్టర్ అనుమతి కోరామని, కలెక్టర్ ఆదేశానుసారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్క భవానీ భక్తుడు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని, కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోని వారు వేసుకోవాలని సూచించారు. ఉచిత దర్శనం, రూ.100 టిక్కెట్ ఆన్‌లైన్ స్లాట్ అందుబాటులో ఉంచామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments