Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం కుర్చీలో భారతీరెడ్డి? అందుకే జగన్ అలా చేశారా?

Webdunia
శనివారం, 9 జులై 2022 (10:11 IST)
వైసీపీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం జరిగిన నేపథ్యంలో.. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్‌కు జైలుకెళ్లాల్సిన పరిస్థితే వస్తే.. ముఖ్యమంత్రి కుర్చీలో తన భార్య భారతీరెడ్డిని కూర్చోబెట్టేందుకే జగన్ తన తల్లి వైఎస్‌ విజయలక్ష్మిని వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి సాగనంపారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. 
 
గౌరవాధ్యక్ష పదవికి విజయలక్ష్మితో బలవంతంగా రాజీనామా చేయించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా ఇడుపులపాయలో రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి తల్లి విజయలక్ష్మితో కలిసి జగన్‌ ప్లీనరీకి వచ్చారు. 
 
వాస్తవానికి ఆమె శనివారం వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ తొలిరోజునే రావడంతో ఈ కథనాలు నిజమనే వాదన వినిపిస్తోంది. వైసీపీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు విజయలక్ష్మి ప్రకటించేశారు. తన కుమార్తె, వైఎస్సార్‌టీపీ నాయకురాలు షర్మిల తెలంగాణలో ఒంటరి పోరు చేస్తున్నందున ఆమెకు మద్దతిచ్చేందుకే తానీ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. తన కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసినందునే వైసీపీ నుంచి వైదొలగాలని నిర్ణయించానని తెలిపారు.
 
ఇకపోతే అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేస్తే.. జగన్‌కు చట్టపరమైన చిక్కులు తప్పవని.. అదే జరిగితే సీఎం స్థానంలో భార్య భారతీరెడ్డిని కూర్చోబెట్టాలన్న ముందస్తు ప్రణాళికలో భాగంగానే వారిద్దరినీ ఆయన పొరుగు రాష్ట్రానికి సాగనంపారని పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments