Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో హాట్ టాపిక్‌గా మంత్రివర్గ మార్పు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (15:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గం మార్పుపై రసవత్తరంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 11వ తేదీన తర్వాత రాష్ట్రానికి కొత్త మంత్రులు రాబోతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా స్పష్టం చేశారు. దీంతో కొత్త మంత్రులు ఎవరన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 
 
ఈ పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఏపీ మంత్రివర్గ విస్తరణ సీఎం అభీష్టం మేరకే జరుగుతుందన్నారు. కొత్త మంత్రులు ఎవరన్న అంశంపై తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారని చెప్పారు. 
 
మరోవైపు, వైకాపా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మంత్రివర్గ విస్తరణ స్వాగతిస్తున్నాం. నేను మంత్రిపదవి రేసులో లేను. దయజేసి నా పేరును మంత్రిపదవి రేసులో ఉన్నాననే ప్రచారం చేయద్దు. జిల్లాలో బీసీ వ్యక్తికి కాకుండా అగ్రకులంలో ఉన్న నాకు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. బొత్స సత్యనారాయణను మంత్రిగా కొనసాగించాలని కోరుతున్నాం. నేను నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నాను. జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతాను అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments