Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరూపిస్తే తన యావదాస్తిని రాసిస్తానంటున్న వైకాపా మాజీ మంత్రి

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (18:26 IST)
ఒంగోలు జిల్లాలో వైకాపాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థలో తాను పెట్టుబడులు పెట్టినట్టు నిరూపిస్తే తన యావదాస్తిని రాసిస్తానని ఆయన ప్రకటించారు. తనతో పాటు తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డికి కూడా రూపాయి పెట్టుబడులు లేవని స్పష్టం చేశారు. ఆరోపణలు రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని బాలినేని ప్రకటించారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. తమపై దుష్ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. తనకు సినీ రంగంలో పెట్టుబడులు ఉన్నాయో లేదో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరా తీసుకోవచ్చన్నారు. 
 
కాగా, ప్రముఖ నిర్మాణ సంస్థలో మాజీ మంత్రి బాలినేనికి పెట్టుబడులు ఉన్నాయంటూ విశాఖపట్టణంకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇటీవల ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ అక్రమ లావాదేవీల విషయంలో మాజీ మంత్రి బాలినేని బినామీ, ఆయన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి, వైకాపా నేత, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వర రావులపై విచారణ జరిపించాలని కోరారు. సదరు నిర్మాణ సంస్థ అక్రమాస్తులు, లావాదేవీల వెనుక తెలంగాణకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన సన్నిహితుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments