Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ గేమ్ వ్యసనం... అమ్మ తిట్టిందనీ ఆత్మహత్య

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (09:11 IST)
నెల్లూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ విద్యార్థిని.. కాలేజీ ఫీజు కట్టేందుకు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను గేమ్‌లో పోగొట్టుకుంది. ఈ విషయం తెలిసిన తల్లి కుమార్తెను మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కుమార్తె బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామానికి చెందిన పోలు కవిత అనే విద్యార్థిని బీఫార్మసీ చదువుతుంది. 20 యేళ్ల కవిత నెల్లూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తుంది. అయితే, ఆన్‌లైన్ గేమ్‌లకు బాగా అలవాటుపడిన కవిత.. కాలేజీ ఫీజు కట్టమని తల్లిదండ్రులు ఇచ్చిన రూ.2.50 లక్షల డబ్బును గేమ్‌లలో పోగొట్టుకుంది. 
 
ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా ఆన్‌లైన్ గేమ్‌ వ్యసనంతో నాశనం చేశావంటూ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తల్లిదండ్రులు తిట్టారన్న మనస్తాపంతో ఐదు రోజుల క్రితం కవిత పురుగుల మందు తాగింది. 
 
ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి చేర్చగా, చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు, ఎదిగివచ్చిన కుమార్తె ఇలా అర్థంతరంగా తనవు చాలించడంతో ఆమె తల్లిందడ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments