Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగిల్‌గా రా.. ఎవడు పులో ఎవడు పిల్లో తేలిపోతుంది.. అయ్యన్న కౌంటర్

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (17:00 IST)
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అయితే విజయ్ సాయి రెడ్డి కొద్ది గంటల్లోనే ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డికి అయ్యన్న పాత్రుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. 
 
16నెలలు చిప్పకూడు తినడం వలన శరీరం మందపడింది. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయ సాయి రెడ్డి పులిగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదంటూ విమర్శించారు. 
 
బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ అంటూ అయ్యన్న పాత్రుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
 
నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్‌గా రావాలి. అప్పుడు తేలిపోద్ది ఎవడు పులో ఎవడు పిల్లో! అంటూ ట్విటర్ వేదికగా అయ్యన్న పాత్రుడు విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments