Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లా ఆటో డ్రైవర్లకు అవగాహన

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (07:22 IST)
కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి సారధ్యంలో నందిగామ రూరల్ సిఐ సతీష్ వీరులపాడు మండలంలోని వి.అన్నవరం, దొడ్డ దేవరపాడు, జయంతి, పెద్దాపురం, గూడెం మాధవరం, కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్టులలో తనిఖీలు నిర్వహించారు. 

చెక్ పోస్టు వద్ద ఉన్న సిబ్బందినీ అప్రమత్తం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అక్రమ రవాణా చేసే వారి ఆట కట్టించాలని పలు సూచనలు సిబ్బందికి అందజేశారు. అలాగే కంచికచర్ల నుంచి మధిర వెళ్లే రహదారిలో పరిమితికి మించి ప్రయాణికులను రవాణా చేస్తున్న ఆటోలను ఆపి, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ.. అక్రమ రవాణాకు తావులేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని, వారికి తగు సూచనలు సలహాలు అందజేయడం జరిగిందని, అలాగే ప్రమాదాలు జరగకుండా ప్రమాదాల నివారణ భాగంగా ఆటో డ్రైవర్లకు,కూలీలకు  అవగాహన కల్పించడం జరిగిందని, పరిమితికి మించి ఆటోలలో ప్రయాణం ప్రమాదకరమని ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించ రాదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments