Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు ఆటో డ్రైవర్ .. ఇపుడు ఆటో సర్పంచ్ .. ఎవరు?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో ప్రశాంతంగా ముగిశాయి. దీంతో అనేక మంది సామాన్యులు ఇపుడు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇలాంటి వారిలో వివిధ వృత్తులు చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నవారు ఉన్నారు. ఈ క్రమంలో నిన్నామొన్నటివరకు ఆటో డ్రైవరుగా ఉన్న వ్యక్తి ఇపుడు ఆటో సర్పంచ్‌గా మారిపోయాడు. దీనికి కారణం.. గ్రామపంచాయతీ ఎన్నికలే. 
 
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జంగాలిపాలెం సర్పంచ్‌ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసిన గొరపల్లి నరసింగరావు మూడో ప్రయత్నంలో విజయం సాధించాడు. అతడు 1995 నుంచి టీడీపీ కార్యకర్త. చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. 
 
2006 నుంచి ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండేవాడు. 2006, 2013లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. 
 
అయినా నిరాశ చెందకుండా తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీచేసి 94 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పంచాయతీలోని 8 వార్డులకుగాను ఆరు టీడీపీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. దీంతో ఆ గ్రామంలో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments