Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ మార్చుకున్న అసని తుఫాను - కోస్తాంధ్రకు ముప్పు

Webdunia
సోమవారం, 9 మే 2022 (22:13 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న అసని తుఫాను తన దిశను మార్చుకుంది. ఇప్పటికే తీవ్ర తుఫానుగా మారిన అని.. ప్రస్తుతం విశాఖపట్టణానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు భారత వాతవరణ శాఖ వెల్లడించింది. 
 
అయితే, ఈ తుఫాను తొలుత ఉత్తరాంధ్ర మీదుగా ఒడిశా తీరంవైపు వెళుతుందని అంచనా వేశారు. కానీ, ఇపుడు ఈ తుఫాను దశ మార్చుకుని కోస్తాంధ్ర వైపు కదులుతున్నట్టు సమాచారం. దీంతో కోస్తాంధ్రతో పాటు తమిళనాడుకు ఈ తుఫాను ముప్పు పొంచివుంది. 
 
అయితే, భారత వాతావరణ శాఖ సోమవారం వేసిన అంచనా ప్రకారం తుఫాను మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరానికి చేరుకుంటుంది. మరో రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తీరాన్ని చేరుకునే అవకాశం లేదు.
 
మే 11 తేదీన ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసని తుఫాను ప్రభావం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంది. నర్సీపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, రాజమండ్రి, కోనసీమ, విజయవాడలలో వర్షాలు కురుస్తాయి. అనంతపురం, కడప జిల్లాల్లో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments