Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ హయాంలో మేధావులపై దాడులు.. అయిలయ్యకు భద్రత ఇవ్వండి

దళితులు, అంబేద్కర్ వాదుల కోసం కంచ అయిలయ్య ఎంతో కృషి చేశారని ఆయనకు ప్రతిష్టమైన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ప్రాణహ

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (11:35 IST)
దళితులు, అంబేద్కర్ వాదుల కోసం కంచ అయిలయ్య ఎంతో కృషి చేశారని ఆయనకు ప్రతిష్టమైన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మేథావులందరిపైనా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 
 
ఐలయ్యపే బెదిరిస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఆర్య వైశ్యుల‌పై కంచ ఐల‌య్య రాసిన పుస్తకం వివాదాస్పదం కావడం… ఆయ‌న‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ఓయూ పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య తరువాత కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. గౌరీ లంకేష్ హత్యలాగా మరో హత్య జరగకుండా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, బహుబాష నటుడు, సాహితీవేత్త గిరీష్ కర్నాడ్ తో పాటు ప్రముఖులకు భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇదే తరహాలో కంచ అయిలయ్యకు కూడా తెలంగాణ రాష్ట్రం భద్రత ఇవ్వాలని.. అలాగే మిగిలిన మేధావులకూ సర్కారు భద్రత ఏర్పాటు చేయాలని ఓవైసీ అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments