Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కుల ధరలు పైపైకి..! మంగళగిరిలో నిలువుదోపిడి

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (14:09 IST)
అనుకున్నదే అయింది. కరోనా అనుమానిత కేసు నేపథ్యంలో మాస్కులు ధరలకు రెక్కలు వచ్చాయి. రూ.2 నుంచి రూ.5కే దొరికే సాధారణ మాస్కుల ధరలను మందుల దుకాణదారులు ప్రజలకు అందుబాటులో లేని ధరలకు అమ్ముతున్నారు. ఒక్కో మాస్కును రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నారు. 
 
మరోవైపు కృత్రిమ కొరత సృష్టిస్తూ డిమాండ్‌కు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల నుంచి మాస్క్‌లు, హ్యాండ్‌వాష్‌ శానిటైజర్‌లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఒక్కోసారి వీటి కోసం తిరగని మందుల దుకాణం అంటూ ఉండడం లేదు. ఒక్కోషాపునకు రోజుకు పదుల సంఖ్యలో ప్రజలు వీటి కోసం తిరుగుతున్నారు. 
 
జిల్లా ఔషధ నియంత్రణాధికారులు ఇటీవల కంటి తుడుపుగా దాడులు చేసి మిన్నకుండిపోయారు. దాడులు జరిగినా యధావిధిగా మాస్కులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరోవైపు శానిటైజర్లు అయితే అసలు దొరకని పరిస్థితి నెలకొంది. కరోనా ప్రభావం పడడంతో శానిటైజర్ల వాడకం ఎంతో కీలకంగా మారుతోంది. 
 
కాగా, అధికారులకు అందిన సమాచారం మేరకు పట్టణంలో 40 మంది వరకు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు తెలిసింది. వారి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేగాక కరోనా కేసుతో మరింత విస్త్రతంగా సర్వే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments