Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కుల ధరలు పైపైకి..! మంగళగిరిలో నిలువుదోపిడి

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (14:09 IST)
అనుకున్నదే అయింది. కరోనా అనుమానిత కేసు నేపథ్యంలో మాస్కులు ధరలకు రెక్కలు వచ్చాయి. రూ.2 నుంచి రూ.5కే దొరికే సాధారణ మాస్కుల ధరలను మందుల దుకాణదారులు ప్రజలకు అందుబాటులో లేని ధరలకు అమ్ముతున్నారు. ఒక్కో మాస్కును రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నారు. 
 
మరోవైపు కృత్రిమ కొరత సృష్టిస్తూ డిమాండ్‌కు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల నుంచి మాస్క్‌లు, హ్యాండ్‌వాష్‌ శానిటైజర్‌లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఒక్కోసారి వీటి కోసం తిరగని మందుల దుకాణం అంటూ ఉండడం లేదు. ఒక్కోషాపునకు రోజుకు పదుల సంఖ్యలో ప్రజలు వీటి కోసం తిరుగుతున్నారు. 
 
జిల్లా ఔషధ నియంత్రణాధికారులు ఇటీవల కంటి తుడుపుగా దాడులు చేసి మిన్నకుండిపోయారు. దాడులు జరిగినా యధావిధిగా మాస్కులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరోవైపు శానిటైజర్లు అయితే అసలు దొరకని పరిస్థితి నెలకొంది. కరోనా ప్రభావం పడడంతో శానిటైజర్ల వాడకం ఎంతో కీలకంగా మారుతోంది. 
 
కాగా, అధికారులకు అందిన సమాచారం మేరకు పట్టణంలో 40 మంది వరకు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు తెలిసింది. వారి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేగాక కరోనా కేసుతో మరింత విస్త్రతంగా సర్వే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments