Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చాత్తాపమే లేదు.. ప్రజలు దిగిపొమ్మంటే దిగిపోతా.. వైఎస్ జగన్

సెల్వి
గురువారం, 25 జనవరి 2024 (11:31 IST)
తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషనల్ సమ్మిట్‌లో వైఎస్ జగన్ ఇండియా టుడేతో సంభాషించారు  ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. 58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలను ఎందుకు మార్చారని సమ్మిట్‌లో ప్రశ్నించారు. 
 
జగన్‌కు అధికార వ్యతిరేకత అంటే భయం ఉందా, అందుకే ఎమ్మెల్యేలను మారుస్తున్నారా అని ఎదురైన ప్రశ్నలకు స్పందిస్తూ.. ఏ పార్టీ అయినా ఎమ్మెల్యేలను మార్చడం మామూలే అని జగన్ బదులిచ్చారు. ప్రతి పార్టీకి దాని స్వంత సర్వే నివేదికలు ఉన్నాయి. అదే విధంగా వైసీపీ కూడా రిపోర్టులు ఇచ్చింది. 
 
స్థానిక ఎమ్మెల్యేలకు ప్రజల్లో మంచి గుర్తింపు లేని సందర్భాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి వైసీపీ ప్రభుత్వం ఇమేజ్ బాగానే ఉన్నా ఈ ఎమ్మెల్యేల పరువు మాత్రం చెడింది. అలాంటి నియోజకవర్గాల్లో మార్పుచేర్పులు చేస్తున్నాం.
 
కుల సమీకరణలు, ప్రజల అవగాహన ఆధారంగానే జగన్ ఈ మార్పులు చేశారన్నారు. తన ఐదేళ్ల పదవీకాలంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఎన్నికల్లో ప్రజా తీర్పు ఆధారంగా తాను కూడా పదవి నుంచి తప్పుకుంటానని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ప్రజలు దిగిపొమ్మంటే దిగిపోతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తుందని సీఎం జగన్ విమర్శించారు. 
 
గతంలో మా బాబాయ్ వివేకానందరెడ్డిని నాపై పోటీ దింపారన్నారు. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు నా కుటుంబాన్ని చీల్చేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. విభజించి పాలించడం కాంగ్రెస్ నైజం అన్న సీఎం జగన్... వాళ్లకు దేవుడే గుణపాఠం చెబుతాడన్నారు. 
 
ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు విషయంలో ప్రతీకారం తీర్చుకోవడం అన్నది లేనే లేదని సీఎం జగన్ అన్నారు. అవినీతి ఆరోపణలు, ఆధారాలతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. 
 
సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలు చూస్తాయన్నారు. ఏపీలో కాంగ్రెస్, బీజేపీకి ఉనికి లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ-జనసేన కూటమికి మధ్యే పోటీ ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments