Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఏపీలో సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో రాయితీలు..

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (08:21 IST)
సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ పండుగ కోసం 3120 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అలాగే, తిరుగు ప్రయాణంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు 3280 బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంది. 
 
ఈ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రయాణ చార్జీలో 5 నుంచి 25 శాతం మేరకు రాయితీని కల్పించనుంది. ఈ ప్రత్యేక బస్సులో ముందస్తు రిజర్వేషన్లను ఆర్టీసీ యాప్, అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా అందుబాటులో ఉంచారు. 
 
ప్రయాణికులు రానుపోను ఒకేసారి టిక్కెట్ రిజర్వు చేయించుకుంటే పది శాతం, నలుగురి మించి కుటుంబ సభ్యులందరూ ఒకేసారి ప్రయాణిస్తే 5 శాతం, అలాగే వాలెట్ ద్వార టిక్కెట్ కొనుగోలు చేస్తే 5 శాతం, వృద్ధుల చార్జీల్లో 25 శాతం తగ్గింపు ప్రకటించింది. ఈ సంక్రాంతి బస్సులు శుక్రవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా 3120 బస్సులను అధికారులు సిద్ధం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

యువతను ఆకట్టుకునేలా మ్యానిప్యూలేటర్ టైటిల్ వుందన్న బి.గోపాల్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

గోవాలో తాగిపడిపోతే సుప్రీత ఆ పని చేసింది : అమర్ దీప్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments