Webdunia - Bharat's app for daily news and videos

Install App

చడీచప్పుడు లేకుండా వడ్డన.. కనీస చార్జీ రూ.10 : ఏపీఎస్ఆర్టీసీ చిల్లర చిట్కా

చిల్లర కొరత పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం మోపింది. ముఖ్యంగా, గుంటూరు జిల్లాలో ఆర్టీసీ యంత్రాంగం చడీచప్పుడు లేకుండా ఈ చార్జీలను పెంచేసింది. చిల్లర పేరుతో ఆర్టీసీ అధికారులు ప్రదర్శించిన త

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (13:25 IST)
చిల్లర కొరత పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం మోపింది. ముఖ్యంగా, గుంటూరు జిల్లాలో ఆర్టీసీ యంత్రాంగం చడీచప్పుడు లేకుండా ఈ చార్జీలను పెంచేసింది. చిల్లర పేరుతో ఆర్టీసీ అధికారులు ప్రదర్శించిన తెలివికి ప్రయాణికులు ఔరా అంటూ విస్తుబోతున్నారు.
 
ఆర్టీసీ బస్సు కండెక్టర్లను చిల్లర కష్టాలు వేధిస్తున్న విషయంతెల్సిందే. ఈ సమస్యను తొలగించాలంటూ వారు మొత్తుకుంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా చార్జీలను పెంచేశారు. 
 
ఉదాహరణకు బెంగళూరుకు రూ.647 ఉంటే రూ.650 చేశారు. చెన్నైకు రూ.572 ఉంటే రూ.575 చేశారు. సాధారణంగా రెండు రూపాయల పైన ఉంటే ఐదుకు చేర్చినా ఫర్వాలేదు. 
 
కానీ, రేపల్లెకు వెళ్ళేటప్పుడు మాత్రం రూ.71 ఉంటే రూపాయి తగ్గిస్తే చిల్లర పని ఉండదు. కానీ దానిని కూడా ఏకంగా రూ.75 చేశారు. త్వరలో ఆర్డనరీ బస్సులకు కూడా ఇదే వర్తింప చేస్తామని దర్జాగా ప్రకటించారు. అంటే, ఇప్పుడు కనీస ఛార్జీగా ఉన్న రూ.6 కనుమరుగై రూ.10 అవుతుందన్నమాట! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments