Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు తగు న్యాయం: సీపీఐ

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:25 IST)
నూతన పారిశ్రామిక విధానంలో సవరణలు చేపట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు తగు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఈ మేరకు సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. గత ప్రభుత్వ  విధానాల కంటే తమ ప్రభుత్వం మరింత మెరుగైన పారిశ్రామిక విధానం తీసుకొస్తుందని భావించిన పారిశ్రామికవేత్తలకు నిరాశే మిగిలిందని వ్యాఖ్యానించారు. గత పారిశ్రామిక పాలసీకన్నా నూతన ఇండస్ట్రియల్ పాలసీలో పలు కోతలు విధించారని మండిపడ్డారు.

పెట్టుబడి, విద్యుత్, వడ్డీ రాయితీలను కుదించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రివర్స్ విధానాల వల్ల పారిశ్రామిక రంగాభివృద్ధి -2.2 శాతానికి పడిపోయిందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ విధానాలకు తోడు కరోనా మహమ్మారి వల్ల పలు రంగాలకు చెందిన లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా పారిశ్రామిక విధానంలో మార్పులు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments