Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (22:27 IST)
అమరావతి: ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ఇవ్వడానికి వారి వివరాలు కోరుతున్నట్లు అకాడమీ అధ్యక్షుడు తాటికొండ విజయకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 20వ తేదీ లోపల వివరాలను ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ, 04-006-597, అంజయ్య రోడ్డు, కార్తీకేయ హాస్పటల్ పక్కన, ఒంగోలు-523002కు పంపాలని తెలిపారు.
 
ఏప్రిల్ 27న ఉగాది పురస్కార సత్కారాల కార్యక్రమం నిర్వహిస్తారు. కళ, విద్య, వైద్య, సామాజిక సేవ, విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, విశిష్ట ప్రతిభ కనపచిన జర్నలిస్టులు, ఇంకా ఇతర రంగాలకు చెందిన 108 మందికి ఈ పురస్కారాలు అందజేస్తారు. 32 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థ గతంలో సినీరంగానికి చెందిన ప్రముఖులు అక్కినేని నాగేశ్వర రావు, టీఎల్ కాంతారావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, డాక్టర్ సి.నారాయణ రెడ్డి, వి.రామకృష్ణ, వాణీజయరామ్ తదితరులను సత్కరించింది.
 
తిరుపతిలో ఘంటసాల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసింది. 2014 మే 12 నుంచి ఆగస్ట్ 28 వరకు 108 రోజులు ఘంటసాల పాడిన పాటలతో ఆరాధనోత్సవాలు నిర్వహించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments