Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (22:27 IST)
అమరావతి: ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ఇవ్వడానికి వారి వివరాలు కోరుతున్నట్లు అకాడమీ అధ్యక్షుడు తాటికొండ విజయకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 20వ తేదీ లోపల వివరాలను ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ, 04-006-597, అంజయ్య రోడ్డు, కార్తీకేయ హాస్పటల్ పక్కన, ఒంగోలు-523002కు పంపాలని తెలిపారు.
 
ఏప్రిల్ 27న ఉగాది పురస్కార సత్కారాల కార్యక్రమం నిర్వహిస్తారు. కళ, విద్య, వైద్య, సామాజిక సేవ, విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, విశిష్ట ప్రతిభ కనపచిన జర్నలిస్టులు, ఇంకా ఇతర రంగాలకు చెందిన 108 మందికి ఈ పురస్కారాలు అందజేస్తారు. 32 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థ గతంలో సినీరంగానికి చెందిన ప్రముఖులు అక్కినేని నాగేశ్వర రావు, టీఎల్ కాంతారావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, డాక్టర్ సి.నారాయణ రెడ్డి, వి.రామకృష్ణ, వాణీజయరామ్ తదితరులను సత్కరించింది.
 
తిరుపతిలో ఘంటసాల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసింది. 2014 మే 12 నుంచి ఆగస్ట్ 28 వరకు 108 రోజులు ఘంటసాల పాడిన పాటలతో ఆరాధనోత్సవాలు నిర్వహించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments