Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాట్సాఫ్ రోజా, ఏం చేశారంటే?

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (17:34 IST)
సినీనటి, ఎమ్మెల్యే రోజా మరోసారి దయాగుణాన్ని చాటుకున్నారు. గత కొన్నిరోజుల ముందు నిండుగర్భిణిగా ఉన్న మహిళ నగరి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం.. ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో తన సొంత కారులో తిరుపతికి గర్భిణిని పంపించారు రోజా. 
 
అయితే మళ్లీ మరోసారి తన దాతృత్వాన్ని చూపారు. కరోనా వైరస్ మహమ్మారిలా మారుతున్న సమయంలోను ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న పారిశుధ్య కార్మికులకు రోజా ప్రతిరోజు భోజనం పెడుతున్నారు. వారికొక్కరికే కాదు పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బందికి రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు.
 
అంతేకాకుండా దాతల నుంచి విరాళాలు సేకరించి పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు బియ్యం, పప్పు దినుసులను అందించారు రోజా. నగరిలో ఈరోజు పారిశుధ్య కార్మికులకు ఉచితంగా బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేశారు.
 
విపత్కర పరిస్థితుల్లోను మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులు నిజంగా గొప్పవారని, అలాంటి వారిని ఆర్థికంగా ఆదుకోవడం మన ధర్మమని చెప్పారు రోజా. మరింతమంది దాతలు ముందుకు వచ్చి రోడ్లపై ఉన్న నిరుపేదలు, అనాధలు, అభాగ్యులు, నిరాశ్రయలకు తమ వంతు సహాయం చేయాలని.. కడుపు నిండా భోజనం పెట్టాలని విజ్ఞప్తి చేశారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments