Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బలపడుతున్న నైరుతి రుతుపవనాలు

Webdunia
గురువారం, 26 మే 2022 (17:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. వీటి కారణంగా వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి బలమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా, వీటి ప్రభావం కారణంగా ఏపీతో పాటు తమిళనాడు, లక్ష్యదీప్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్నిప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమారిన ప్రాంతంతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
వచ్చే 48 గంటల్లో దక్షి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు మొత్తం మాల్దీవులు, లక్ష్యదీప్‌లోని పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలపై ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడివున్నాయి. 
 
దీంతో నైరుతు రుతపవనాలు బలపడి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లక్ష్యదీప్, తెలంగాణా రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments