Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం సొమ్ముతో పెత్తందారుడి జల్సా ప్యాలెస్.. టాయిలెట్ ధర రూ.25 లక్షలు : టీడీపీ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (09:37 IST)
విశాఖపట్టణంలోని రిషికొండకు బోడిగుండు కొట్టించి, అక్కడ ఏపీ పర్యాటక శాఖ పేరుతో ఏపీ ప్రభుత్వం రూ.500 కోట్లు వెచ్చించి అత్యంత విలాసమైన భవనాలను నిర్మిస్తుంది. ఈ భవనాల్లో సమకూర్చే విలాసవంతమైన సౌకర్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. "జనం సొమ్ముతో పెత్తందారుడి జల్సా ప్యాలెస్" అంటూ సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తుంది. ఈ ప్యాలెస్‌లోని మరుగుదొడ్డిలో ఏర్పాటు చేసిన కమోడ్ ధర అక్షరాలా రూ.25 లక్షలు అంటూ ఓ పోస్ట్‌ను ట్వీట్ చేసింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అధ్వాన్నంగా ఉంటే వాటికి మరమ్మతులు చేసేందుకు డబ్బులు లేవని చేతులెత్తేసిన జగన్ రెడ్డి సర్కారు.. తన వ్యక్తిగత విలాస జీవితం కోసం జనం సొమ్మును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారంటూ టీడీపీ, జనసేన పార్టీ నేతలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమయ్యేలా రిషికొండపై నిర్మించిన భవనాల్లో కల్పించిన సౌకర్యాల కోసం ఏపీ సర్కారు భారీగా నిధులను ఖర్చు చేసిందన్న విషయం తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments