Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం సొమ్ముతో పెత్తందారుడి జల్సా ప్యాలెస్.. టాయిలెట్ ధర రూ.25 లక్షలు : టీడీపీ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (09:37 IST)
విశాఖపట్టణంలోని రిషికొండకు బోడిగుండు కొట్టించి, అక్కడ ఏపీ పర్యాటక శాఖ పేరుతో ఏపీ ప్రభుత్వం రూ.500 కోట్లు వెచ్చించి అత్యంత విలాసమైన భవనాలను నిర్మిస్తుంది. ఈ భవనాల్లో సమకూర్చే విలాసవంతమైన సౌకర్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. "జనం సొమ్ముతో పెత్తందారుడి జల్సా ప్యాలెస్" అంటూ సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తుంది. ఈ ప్యాలెస్‌లోని మరుగుదొడ్డిలో ఏర్పాటు చేసిన కమోడ్ ధర అక్షరాలా రూ.25 లక్షలు అంటూ ఓ పోస్ట్‌ను ట్వీట్ చేసింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అధ్వాన్నంగా ఉంటే వాటికి మరమ్మతులు చేసేందుకు డబ్బులు లేవని చేతులెత్తేసిన జగన్ రెడ్డి సర్కారు.. తన వ్యక్తిగత విలాస జీవితం కోసం జనం సొమ్మును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారంటూ టీడీపీ, జనసేన పార్టీ నేతలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమయ్యేలా రిషికొండపై నిర్మించిన భవనాల్లో కల్పించిన సౌకర్యాల కోసం ఏపీ సర్కారు భారీగా నిధులను ఖర్చు చేసిందన్న విషయం తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments