Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది, ఇక అరాచకాలు సాగవు...

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (11:52 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంద‌ని, ఇక అరాచకాలు సాగవ‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనంతా ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు అరాచకాలే తప్ప అభివృద్ది శూన్యం అని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే, వైసీపీ  కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నార‌ని ఆరోపించారు.

 
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు  నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీ  మహిళా సర్పంచి మల్లేశ్వరి ఇంటిపై వైసీపీ రౌడీమూకల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని  అచ్చెన్నాయుడు అన్నారు. మహిళా హోం మంత్రి నియోజకవర్గంలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటే,  రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
 
అధికారం ఉందని మహిళల పట్ల బరితెగించి వ్యవహరిస్తున్నవారికి ముందు రోజుల్లో మహిళల చేతిలో బడితె పూజ ఖాయం అని చెప్పారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది, ఇక వారి అరాచకాలు సాగవు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది  టీడీపీ ప్రభుత్వమేనని వైసీపీ గుర్తుంచుకోవాల‌న్నారు. మళ్లీశ్వరి ఇంటిపై దాడికి పాల్పడ్డవారిని, దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాల‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments