Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేలు కుట్టడంతో రక్తపు వాంతులు.. విద్యార్థి మృతి

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (12:23 IST)
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఓ విషాదకర ఘటన జరిగింది. తేలు కుట్టడంతో రక్తపు వాంతులు చేసుకున్న విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. తరగతి గదిలో పడివున్న చాక్లెట్ రేపర్లను బయటపడేస్తుండగా విద్యార్థిని తేలుకుట్టింది. ఆ తేలు విషం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో రక్తపు వాంతులు చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన వై.ప్రసాద్, శ్రీదేవిల కుమారుడు అభిలాష్ (14) అనే బాలుడు వాకతిప్ప జడ్పీహెచ్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. వలస కూలీ అయిన ప్రసాద్ వరంగల్‌లో పని చేస్తుండగా, శ్రీదేవి మాత్రం కువైట్‌లో పనిచేస్తుంది. అభిలాష్ మాత్రం తన తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. 
 
ఈ పరిస్థితుల్లో గురువారం అతడు తన స్నేహితులతో కలిసి క్లాస్ రూంలో పడివున్న చాక్లెట్ రేపర్లను ఏరి, బయటపడేతుండగా ఆ రేపర్ల కింద దాగివున్న తేలు కుట్టింది. ఆ వెంటనే అభిలాష్‌ను ఉపాధ్యాయులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు పంపించారు. అయితే, అప్పటికే విషం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో రక్తపు వాంతులు చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments