Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఎయిర్‌పోర్టులో హజ్ యాత్ర టెర్మినల్ : హజ్ కమిటి ఛైర్మన్ గౌసల్ ఆజామ్

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (13:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారికి మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి ఛైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజామ్ చెప్పారు. వచ్చే సీజనులో హజ్ యాత్రికుల కోసం సౌకర్యాల కల్పన నిమిత్తం హజ్ కమిటి ప్రత్యేక అధికారి ఎల్.అబ్దుల్ ఖాదిర్‌తో కలిసి ముంబైలోని హజ్ కమిటి భారతదేశ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. 
 
హజ్ కమిటి ఆఫ్ ఇండియా సీఈవో యాఖుబ్ శాఖాను కలిశారు. హజ్ 2023కు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లగోరే యాత్రికులను విజయ వాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే  బయలుదేరే విధంగా ఎంబారిగేషన్ పాయింట్‌ను తిరిగి ఇవ్వాలని విఙ్ఞప్తి చేశారు. యాత్రికులూ సౌదీ అరేబియాలో మక్కా, మదీనాలలో అక్కడ బసచేసే భవనాన్ని ఎంపిక చేసుకునేందుకు ఒక అధికారిని ముందుగా అక్కడకెళ్లి బస ఎర్పాట్లు చూసుకునేందుకుగానూ సౌదీ ప్రభుత్వ అనుమతి కోరాలన్నారు.
 
ఖాదిముల్ హజ్ వాలంటీర్ల ఎంపికలో హజ్ కమిటీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు కూడ అవకాశం ఇప్పించాలని హజ్ కమిటి ఆఫ్ ఇండియా సీఈవో యాఖుబ్ ఖాన్ విన్నవించారు. ఈమేరకు అయనకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. అంధ్రప్రదేశ్ హజ్ కమిటి వినతులను స్వీకరించిన అయన సానుకూలంగా స్పందించారని గౌసల్ ఆజామ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments