Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిలో కందిపప్పు ధర రూ.65 మాత్రమే... ఎక్కడ?

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (14:38 IST)
దేశ వ్యాప్తంగా కందిపప్పు ధర మండిపోతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ ధరలు రూ.110 నుంచి రూ.140 వరకు పలుకుతున్నాయి. అయితే, ఏపీలో మాత్రం పేదలకు ఊరటనిచ్చేలా రూ.65కే లభిస్తుంది. ఏపీ పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఏర్పాట్లుచేసింది. నెలకు 14542 టన్నుల కందిపప్పును పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఐసీడీఎస్ పథకం కింద 1097 టన్నుల కందిపప్పును వినియోగిస్తున్నారు. సగటున నెలకు రేషన్ దుకాణాల ద్వారా కేవలం 6 వేల నుంచి 6500 టన్నుల మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని మండల నిల్వ కేంద్రాల్లో 1771 టన్నుల మేరకు కందిపప్పు అందుబాటులో ఉంది. 
 
దీనికితోడు మరో 25 వేల టన్నుల సేకరణకు పౌరసరఫరాల శాఖ టెండర్లను ఖరారు చేసి సరఫరాకు అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం 20770 టన్నుల కందిపప్పు నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉంది. ఇది మరో మూడు నెలల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయొచ్చని ఏపీ పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments