Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ దోహదపడాలి : తమ్మినేని సీతారామ్

Webdunia
గురువారం, 15 ఆగస్టు 2019 (12:11 IST)
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో జాతీయజెండాను ఎగరవేసిన అనంతరం శాసనసభాపతి మీడియాతో మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగధనుల కారణంగా భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. ఒక్కసారి స్వాతంత్ర్య ఫలితాలను సమీక్షించుకుంటే మనం అభివృద్ధి సాధించామనే చెప్పాలన్నారు. ముందు ముందు మరిన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సూచించారు. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, మరింత చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పారు. పెద్దల త్యాగాలు, ఆచరణలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.  గతాన్ని ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, నిర్మొహమాటంగా, నిర్కర్షగా పాలన ఉండాలని తెలిపారు. స్వాతంత్ర్య ఫలాలను సమీక్షించి ప్రతి అడుగు ముందుకు వేయాలని కోరారు. కులాలు, మతాలు, జాత్యాహంకారాన్ని రెచ్చగొట్టే అసాంఘీక శక్తులను గమనించి పౌరసమాజం చాలా సంయమనంతో ఉండాలని సూచించారు. 
 
కార్యదీక్షతో, ఐకమత్యంతో కలిసి మెలిసి దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని కాంక్షించారు. స్వాతంత్రదినోత్సవం జరుపుకుంటున్న దేశ, రాష్ట్ర ప్రజలందరికీ 73వ స్వాతంత్ర్య దినోత్సవ ఫలితాలు అందాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ వెల్లడించారు. 
 
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్,  అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇద్దరూ కలిసి అసెంబ్లీ ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments