Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ నుంచి తెలంగాణాకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు శుభవార్త!

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (09:45 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తూ, తెలంగాణాకు బదిలీపై వెళ్లాలనుకునే ఉద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్నఉద్యోగులు కొందరు తెలంగాణ నేటివిటీ కలిగి ఉండడం, తమ భాగస్వాములు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉండటం వంటి కారణాల వల్ల తమను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్నిఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రానికి బదిలీపై వెళ్లాలనుకునే ఉద్యోగుల నుంచి ఆప్షన్ ఫార్మ్స్ సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో  విధి విధానాల‌ను విడుదల చేయబోతోంద‌ని  ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్  చైర్మన్
కె వెంకట రామి రెడ్డి తెలిపారు.
 
ఏపీ, తెలంగాణా విడిపోయిన త‌ర్వాత స‌చివాల‌యం ఉద్యోగులు హైద‌రాబాదు నుంచి విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. ఇక్క‌డ అమ‌రావ‌తిలో స‌చివాల‌యం నిర్మించ‌గానే, చాలా మంది హైద‌రాబాద నుంచి అమ‌రావ‌తికి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇప్ప‌టికీ చాలా మంది నిత్యం హైద‌రాబాదు నుంచి విజ‌య‌వాడ‌కు వ‌స్తున్న‌వారున్నారు. ఇలాంటి ప‌రిస్తితుల్లో ఉద్యోగుల‌కు ఈ ఆప్ష‌న్ ఇవ్వాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments