Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిమ్మగడ్డ'ను ఆటాడుకుంటున్న ఏపీ సీఎస్ ... కోర్టును ఆశ్రయించే యోచనలో ఎస్ఈసీ

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఓ ఆట ఆడుకుంటున్నారు. వచ్చే ఫిబ్రవరి నెలలో ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇదే అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్లకు, ఎస్పీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీల సాహ్ని అనుమతి ఇవ్వలేదు. దీంతో బుధవారం ఒకసారి, గురువారం మరోమారు ఈ సమావేశం వాయిదాపడింది. 
 
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసమే ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు నిమ్మగడ్డ ఓ లేఖ రాయగా, వారు సమావేశంలో పాల్గొనలేదు.
 
ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎస్‌ను ఇప్పటికే అనుమతి కోరినట్లు ఎస్‌ఈసీ చెప్పారు. అయినప్పటికీ, సీఎస్ నుంచి అధికారులకు అనుమతి రాకపోవడం గమనార్హం. దీంతో ఆ వీడియో కాన్ఫరెన్స్ రద్దయింది. దీంతో సీఎస్ నీలం సాహ్నికి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మరోసారి లేఖ రాశారు. కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని అందులో కోరినట్లు తెలిసింది.
 
నిజానికి ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సీఎస్ నీలం సాహ్నికి నిమ్మగడ్డ ఓ లేఖ రాశారు. అయితే, అధికారులంతా కోవిడ్ విధుల్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని బదులిస్తూ ఎస్ఈసీకి ఆమె లేఖ రాశారు. 
 
ఈ క్రమంలో ఆయన మరోసారి లేఖ రాసినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. దీంతో, దీంతో చిర్రెత్తుకొచ్చిన నిమ్మగడ్డ ఏపీ ప్రభుత్వ సీఎస్ వైఖరిపై కోర్టును ఆశ్రయించాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఈ సమావేశంలో పాల్గొనాలని సీఎస్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అధికారులకు అనుమతి ఇవ్వకపోవడాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని ఎస్ఈసీ భావిస్తున్నట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments