Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులు ఎపుడంటే..

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (12:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెలవులు ప్రకటించారు. మే ఒకటో తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు ప్రకటించింది. జూన్ 12వతేదీన పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను చివరి పనిదినాన్ని ఏప్రిల్ 30వతేదీగా నిర్ణయించారు.
 
చివరి రోజు విద్యార్థులు, తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించి, రిపోర్టు కార్డులు అందచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించింది. ఈ మేరకు అధికారులు, స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచింది. 2023-24 విద్యా సంవత్సరానికిగాను జూన్ 12వ తేదీ నుంచి ఏపీలో తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. 
 
నేడు కోస్తా రాయలసీమల్లో వర్షాలు 
మరాఠ్వాడా మీదుగా కర్నాటక వరకు అల్పపడీన ద్రోణి నెలకొనివుంది. దీంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మంగళవారం కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. 
 
మంగళవారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉక్కపోతతో పాటు ఎండ తీవ్ర కొనసాగింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతపురంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
 
గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డు వర్షపాతం.. 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రికార్డు స్థాయిలో కుండపోత వర్షం కురింసింది. రెండు గంటల వ్యవధిలో ఏకంగా 8 సెంటీమీటర్ల మేరకు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా, రామచంద్రాపురంలో 7.98, గచ్చిబౌలిలో 7.75, గాజులరామారంలో 6.5, కుత్బుల్లాపూర్‌లో 5.55, జీడిమెట్లలో 5.33 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 
 
అలాగే, శేరిలింగంపల్లి, కేపీహెచ్‌బీ పరిధిలోనూ అదే మోతాదులో వర్షం కురిసింది. నడి వేసవిలో ఈ స్థాయిలో భారీ వర్షం పడటంతో ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. 2015లో ఏప్రిల్ 12వ తేదీన అత్యధికంగా 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రికార్డు తాజాగా బద్ధలైంది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో నగర వాసులు వణికిపోయారు. 
 
గాలుల వేగానికి హైదరాబాద్‌లోని పలుచోట్ల చెట్ల కొమ్మలు., హోర్డింగులు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని గంటలపాటు నగరంలోని అనేక ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల ప్రాంతంలో మెట్రోజోన్‌లో 89 ఫీడర్లు ట్రిప్‌ అయ్యాయి. రాత్రి 9 గంటల సమయంలో 22 ఫీడర్లలో సరఫరాను పునరుద్ధరించగా, మిగిలినవి మరమ్మతు దశలో ఉన్నాయి. 
 
మరోవైపు వాన తీవ్రతకు ప్రధాన రహదారులపై నీరు భారీగా చేరడంతో ఆబిడ్స్‌, లక్డీకాపూల్‌, అమీర్‌పేట, బంజారాహిల్స్‌ రోడ్‌ నం12, కూకట్‌పల్లి, మియాపూర్‌ మార్గాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిల్చిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రహ్మత్‌నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌హిల్స్‌ ఓంనగర్‌లో గోడకూలి 8 నెలల చిన్నారి జీవనిక మృత్యువాత పడింది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పిల్లర్‌ రేకుల ఇంటిపై పడడంతో గోడకూలి చిన్నారి మరణించింది. 

సంబంధిత వార్తలు

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments