Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఎస్ఐ ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడి... ఎలా చెక్ చేసుకోవాలి?

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (15:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను తాజాగా వెల్లడించారు. ఈ పరీక్షలను ఈ నెల 19వ తేదీన నిర్వహించగా కేవలం పది రోజుల్లోనే ఫలితాలను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించడం గమనార్హం. 
 
మొత్తం 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 19వ తేదీన రాత పరీక్షను మొత్తం 291 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా, 57,923 మంది ఎంపికయ్యారు. వీరిలో పురుషులు 49,386 మంది ఉండగా, 8,537 మంది స్త్రీలు ఉన్నారు. 
 
పరీక్ష నిర్వహించిన మరుసటి రోజే జవాబులకు సంబంధించిన ఆన్సర్ కీని విడుదల చేశారు. దీనిపై పేపర్-1కు దాదాపు 1,553 అభ్యంతరాలు బోర్డుకు అందాయి. వీటిని నిపుణులు పరిశీలించి, ఆన్సర్ కీలో ఎలాంటి మార్పులు చేయలేదని నిర్ధారించింది. 
 
రెండు పేపర్లో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 4వ తేదీ ఉదయం నుంచి స్కాన్ చేసిన ఓఎంఆర్ షీటును వెబ్‌సైట్లలో ఉంచుతారు. ఇక ఇతర అప్‌‍డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments