Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు... మొత్తం కేసులెన్నో తెలుసా?

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (11:23 IST)
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయనపై పలు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లు, వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించిన కేసులో రాయచోటి పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం ఆయనను శ్రీ అన్నమయ్య జిల్లా రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
 
జనసేన పార్టీ నేత మణి ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పోసానికి రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరుపరిచనున్నారు. ప్రస్తుతం పోసానిపై మొత్తం 11 కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో బీఎన్ఎస్ 196,353 (2),111 రెడ్ విత్ 3 (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
వైకాపా హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. నంది అవార్డులపై తీవ్రవిమర్శలు చేసినందుకు కూడా కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments