Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఎన్నికలపై చేతులెత్తేసిన పోలీస్ అధికారుల సంఘం, మా ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేమంటూ?

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (18:45 IST)
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ పంచాయతీ ఎన్నికలకు సిద్థంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి ఆధిత్యనాథ్ మాత్రం ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పేశారు. చిన్నపిల్లలకు టీకాతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం వల్ల అది సాధ్యం కాదని తేల్చేశారు.
 
ప్రభుత్వమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెబితే పోలీసులు కూడా అదే బాటలో నడిచారు. పోలీసు సంఘం నుంచి ఒక లేఖను విడుదల చేశారు. అందులో ఏముందంటే మీ ఎన్నికల తొందర కోసం మా ప్రాణాలు, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేం. గౌరవ ప్రధానమంత్రి కృషి, స్ఫూర్తితో యువ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో కోవిడ్ పైన నియంత్రణ సాధిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ వల్ల ఇన్ని రోజుల శ్రమ వృధా అయ్యే అవకాశముంది.
 
అకస్మాత్తుగా విడుదల చేసిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ పోలీసు సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. కోవిడ్ మహమ్మారి వల్ల 109 మంది పోలీస్ సిబ్బంది ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. 14 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. అనేకమంది ఇప్పటికే పాజిటివ్ సోకినవారిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల్లో విధులు నిర్వర్తించడం మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments