Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశా ఘటన.. 316 మంది ఏపీ వాసులు సేఫ్.. మంత్రి బొత్స ప్రకటన

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (05:59 IST)
ఒడిశాలోని బాలోసార్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో 300మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతూనే వున్నాయి. 
 
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, హవ్‌డాలో 300 మందికి పైగా ఏపీ వాసులు ప్రయాణించారు. ఇందులో కోరమాండల్‌లో జర్నీ చేసిన 267 మంది ఏపీ వాసుల్లో 20మంది స్వల్ప గాయాలకు గురయ్యారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఏపీ సర్కారు తెలిపింది. 
 
ఇక చివరి బోగీలు పట్టాలు తప్పిన హవ్ డా లో ప్రయాణించిన 49 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి 316 మంది సురక్షితంగా ఏపీ వాసులు బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీ ప్రయాణికుల వివరాలను వెల్లడించారు. ఇప్పటికే మంత్రి అమర్నాథ్ రెడ్డి, ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఒడిశా పంపించినట్లు చెప్పారు.
 
రైలు ప్రమాదంలో క్షతగాత్రులను, మృతులను త్వరితగతిన తీసుకు రావాలని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments