Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో టీడీపీ నేతలు చేరడానికి కారణమేంటో తెలుసా?

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (13:04 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ చర్య తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో ఆ నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీలో చేరడానికిగల కారణాలను ఏపీ బీసీ సంక్షేమ శాఖామంత్రి శంకర నారాయణ వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనుమతితోనే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారన్నారు. 
 
ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారనీ, అందులోభాగంగానే ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు టీడీపీలో చేరారని అన్నారు. పైగా, బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు పారిశ్రామికవేత్తలనీ, వీరందరిపై వివిధ కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసుల నుంచి విముక్తి పొందేందుకే వారు కాషాయం కండువా కప్పుకున్నారన్నారు. 
 
ఇకపోతే, నవ్యాంధ్రలో పసుపు పాలన అంతమైందన్నారు. ప్రస్తుతం రాజన్న రాజ్యం మొదలైందన్నారు. అలాగే, ప్రత్యేక హోదా అన్నది జగన్ నినాదమని, దాన్ని సాధించి తీరుతామని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments