Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనకు పిల్లను చూడమన్న వృద్ధుడు.. అవాక్కైన మంత్రి రోజా

Webdunia
మంగళవారం, 17 మే 2022 (11:29 IST)
తాను ఒంటరిగా జీవిస్తున్నానని, అందువల్ల తనకు పిల్లను చూసిపెట్టాలని ఏపీ రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా వద్ద ఓ వృద్ధుడు మొరపెట్టుకున్నాడు. ఆ వృద్ధుడి మాటలు వినగానే ఆమె అవాక్కయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని వైకాపా శ్రేణులు చేపట్టాయి. ఇందులోభాగంగా, చిత్తూరు జిల్లా నగరిలో సోమవారం మంత్రి ఆర్.కె.రోజాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. 
 
తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ప్రశ్నించారు. అయితే, ఓ చోట మాత్రం ఆమెకు వింత అనుభవం ఎదురైంది. తనను కలిసిన ఓ వృద్ధుడిని నెలవారీ పింఛను అందుతుందా? అని ప్రశ్నించారు. 
 
అందుకతడు బదులివ్వకుండా తాను ఒంటరివాడినయ్యాని తనకెక్కడైనా పిల్లను చూడాలని కోరారు. ఆ ప్రశ్నకు అవాక్కైన మంత్రి ఒక్కసారిగా ఫక్కున నవ్వేశారు. ఆమెతో పాటు చుట్టుపక్కలవారు కూడా నవ్వును ఆపుకోలేక పోయారు. పెద్దాయన ప్రశ్నకు రోజా బదులిస్తూ తాను పెన్షన్ల మాత్రమే అందేలా చూడగలనని, అమ్మాయిలను చూడటం తనకు పని కాదని ఆ వృద్ధుడికి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments