Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులు సరిగా చదవలేదు.. అందుకే ఫెయిలయ్యారు : మంత్రి రోజా

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (09:38 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీ  చరిత్రలో ఎన్నడూ లేనంతగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణులు చెందిన విద్యార్థుల కంటే ఫెయిల్ అయిన విద్యార్థుల శాతమే అధికంగా ఉంది. బాగా చదివే విద్యార్థులు సైతం ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వీటిని ఏపీ మంత్రులు తిప్పకొడుతున్నారు. విద్యార్థులు సరిగా చదవలేదని అందుకే  ఫెయిల్ అయ్యారంటూ సెలవిచ్చారు. 
 
తాజాగా ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే.రోజా కూడా ఇదే పాటపాడారు. "తెలుగుదేశం అధికారంలో ఉన్న టీచర్లే ఇపుడూ ఉన్నారు. కోవిడ్ కారణంగా సరిగా చదువుకోకపోవడం వల్లనే కొంతమంది విద్యార్థులు పదో తరగి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు" అని మంత్రి వివరణ ఇచ్చారు. 
 
పైగా, ఫెయిల్ అయిన విద్యార్థులకు సిప్లమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం ఇచ్చామని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు పాస్ అయిన వారికి రెగ్యులర్‌గా ఇచ్చే సర్టిఫికేట్లే ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా, పదో తరగతి పరీక్షల్లో మన రాష్ట్రం కంటే చాలా తక్కువ శాతం పాస్ అయిన రాష్ట్రాలు అనేకం ఉన్నాయని ఆమె గుర్తుచేయడం కొసమెరుపు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments