Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" సినిమాకు టిక్కెట్లు పెంచుకోవచ్చు : పేర్ని నాని

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (13:41 IST)
రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునే అవకాశం ఉన్నట్టు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ, భారీ బడ్జెట్ సినిమా విడుదలైన 10 రోజుల పాటు సినిమా టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చని అన్నారు. సాధారణ ప్రజలకు భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. 
 
మరోవైపు, ఆన్‌లైన్ టిక్కెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. ఇందులో రెండు కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 
 
కాగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తన సొంత బ్యానర్ డీవీవీ సినిమాస్‌పై నిర్మించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments