Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్... యువకుడికి ప్రాథమిక చికిత్స

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (17:46 IST)
ఏపీ మంత్రి, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడుకి రక్తస్రావం కాకుండా ప్రథమిక చికిత్స చేశారు. ఈ సంఘటన విజయవాడ ప్రకాశం బ్యారేజీపై కనిపించింది. ఈ వంతెనపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యుకుడు తలకు దెబ్బతగిలింది. రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ వెంటనే తన వాహనం ఆపి సిబ్బంది సాయంతో ఆ యువకుడికి ప్రథమ చికిత్స చేశారు. తల నుంచి రక్తస్రావం కాకుండా ఆపారు. 
 
108కు ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి, క్షతగాత్రుడుని ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడు 108 అంబులెన్స్‌లో ఎక్కించుకుని వెళ్లేంత వరకు అక్కడే ఉన్నారు. పైగా, అతనికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అంబులెన్స్ సిబ్బందికి నాదెండ్ల సూచించారు. ఆ యువకుడుని విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రిలో చేర్చుతున్నట్టు 108 సిబ్బంది సమాచారం ఇచ్చారు. 
 
కాగా, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడిపే మంత్రి మనోహర్.. రోడ్డుపై జరిగిన ప్రమాదా్ని చూసి కారు ఆపడం, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించే వరకు అక్కడే ఉండటాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంత్రిని ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments