Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ పాదయాత్ర.... మంత్రి జవహర్

రానున్న ఎన్నికల్లో వైకాపా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు. గురువారం నాడు మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా వైసీపీ నాయకులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (18:35 IST)
రానున్న ఎన్నికల్లో వైకాపా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు. గురువారం నాడు మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా వైసీపీ నాయకులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నూరు శాతం ప్రజల్లోకి వెళ్లడంతో అసెంబ్లీ సమావేశాల్లో ఏం చర్చించాలో తెలియక అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని గుర్తు చేశారు. గత అసెంబ్లీ సమావేసాల్లో అర్థవంతమైన చర్చలకు అవకాశమివ్వకుండా గొడవలు సృష్టించి వాకౌట్ చేయడం పరిపాటి అయ్యిందన్నారు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పడం సరికాదని అన్నారు. 
 
రాష్ట్రంలో విపక్ష నేతగా విఫలమవ్వడంతో తన కేసుల నుంచి తప్పించుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు విమర్శించారు. రాజకీయ లబ్ది కోసమే జగన్ పాదయాత్ర చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెపుతారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిని చూసి జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేక పాప పరిహారపు పాదయాత్ర మొదలు పెడుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments