ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ పాదయాత్ర.... మంత్రి జవహర్

రానున్న ఎన్నికల్లో వైకాపా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు. గురువారం నాడు మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా వైసీపీ నాయకులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (18:35 IST)
రానున్న ఎన్నికల్లో వైకాపా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు. గురువారం నాడు మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా వైసీపీ నాయకులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నూరు శాతం ప్రజల్లోకి వెళ్లడంతో అసెంబ్లీ సమావేశాల్లో ఏం చర్చించాలో తెలియక అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని గుర్తు చేశారు. గత అసెంబ్లీ సమావేసాల్లో అర్థవంతమైన చర్చలకు అవకాశమివ్వకుండా గొడవలు సృష్టించి వాకౌట్ చేయడం పరిపాటి అయ్యిందన్నారు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పడం సరికాదని అన్నారు. 
 
రాష్ట్రంలో విపక్ష నేతగా విఫలమవ్వడంతో తన కేసుల నుంచి తప్పించుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు విమర్శించారు. రాజకీయ లబ్ది కోసమే జగన్ పాదయాత్ర చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెపుతారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిని చూసి జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేక పాప పరిహారపు పాదయాత్ర మొదలు పెడుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments