Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరేయ్.. ఆటోలు తీయకండి.. స్టార్ట్ చేయకండి.. మంత్రి ధర్మాన కేకలు

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (13:12 IST)
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పీఎస్ఎన్ఎంహెచ్ పాఠశాలలో శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులో సోమవారం జగనన్న ఆసరా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 
 
అయితే, ఆయన ప్రసంగించే సమయంలో అనేక మంది డ్వాక్రా మహిళలు, లబ్ధిదారులు సమావేశ మందిరం నుంచి గుంపులు గుంపులుగా వెళ్లిపోతున్న దృశ్యాలను మంత్రి చూశారు. దీంతో ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'ఐదు నిమిషాల్లో సమావేశం ముగియనుంది. ఏయ్‌ తల్లీ వెళ్లిపోదురు ఆగండి. 
 
ఒరేయ్‌.. ఆటోలు తీయకండి. స్టార్ట్‌ చేయకండి.. ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది' అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ కార్యక్రమాలకు హాజరైన మహిళలు  మాత్రం మంత్రి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా మధ్యలోనే వెనుదిరిగిపోయారు. వీరిని నిలువరించేందుకు అధికారులు, వలంటీర్లు విశ్వప్రయత్నాలు చేశారు. 
 
సమావేశం జరిగే పాఠశాల గేటుకు తాళం వేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన వారు ఎత్తయిన గోడ ఎక్కి బయటకు దూకి వెళ్లిపోయారు. పోతూపోతూ అధికారులకు శాపనార్థాలు పెట్టారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments