Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరేయ్.. ఆటోలు తీయకండి.. స్టార్ట్ చేయకండి.. మంత్రి ధర్మాన కేకలు

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (13:12 IST)
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పీఎస్ఎన్ఎంహెచ్ పాఠశాలలో శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులో సోమవారం జగనన్న ఆసరా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 
 
అయితే, ఆయన ప్రసంగించే సమయంలో అనేక మంది డ్వాక్రా మహిళలు, లబ్ధిదారులు సమావేశ మందిరం నుంచి గుంపులు గుంపులుగా వెళ్లిపోతున్న దృశ్యాలను మంత్రి చూశారు. దీంతో ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'ఐదు నిమిషాల్లో సమావేశం ముగియనుంది. ఏయ్‌ తల్లీ వెళ్లిపోదురు ఆగండి. 
 
ఒరేయ్‌.. ఆటోలు తీయకండి. స్టార్ట్‌ చేయకండి.. ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది' అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ కార్యక్రమాలకు హాజరైన మహిళలు  మాత్రం మంత్రి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా మధ్యలోనే వెనుదిరిగిపోయారు. వీరిని నిలువరించేందుకు అధికారులు, వలంటీర్లు విశ్వప్రయత్నాలు చేశారు. 
 
సమావేశం జరిగే పాఠశాల గేటుకు తాళం వేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన వారు ఎత్తయిన గోడ ఎక్కి బయటకు దూకి వెళ్లిపోయారు. పోతూపోతూ అధికారులకు శాపనార్థాలు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments