Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరేయ్.. ఆటోలు తీయకండి.. స్టార్ట్ చేయకండి.. మంత్రి ధర్మాన కేకలు

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (13:12 IST)
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పీఎస్ఎన్ఎంహెచ్ పాఠశాలలో శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులో సోమవారం జగనన్న ఆసరా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 
 
అయితే, ఆయన ప్రసంగించే సమయంలో అనేక మంది డ్వాక్రా మహిళలు, లబ్ధిదారులు సమావేశ మందిరం నుంచి గుంపులు గుంపులుగా వెళ్లిపోతున్న దృశ్యాలను మంత్రి చూశారు. దీంతో ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'ఐదు నిమిషాల్లో సమావేశం ముగియనుంది. ఏయ్‌ తల్లీ వెళ్లిపోదురు ఆగండి. 
 
ఒరేయ్‌.. ఆటోలు తీయకండి. స్టార్ట్‌ చేయకండి.. ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది' అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ కార్యక్రమాలకు హాజరైన మహిళలు  మాత్రం మంత్రి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా మధ్యలోనే వెనుదిరిగిపోయారు. వీరిని నిలువరించేందుకు అధికారులు, వలంటీర్లు విశ్వప్రయత్నాలు చేశారు. 
 
సమావేశం జరిగే పాఠశాల గేటుకు తాళం వేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన వారు ఎత్తయిన గోడ ఎక్కి బయటకు దూకి వెళ్లిపోయారు. పోతూపోతూ అధికారులకు శాపనార్థాలు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments